ఏటీఎంలో రూ.500 కొడితే, రూ.2500 నోట్లు వస్తున్నాయ్ !

-

పాత బస్తీలోని ఓ ఏటీఎంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. మొహాల్ పురాలోని ఇశ్రత్ మహల్ లో ఉన్న హెచ్.డి.ఎఫ్.సి ఏటీఎంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రూ. 500 కొడితే రూ. 2,500 వస్తున్నాయి. దీంతో ఏటీఎం దగ్గర జనాలు భారీగా క్యూ కట్టారు. ఏటీఎం నుంచి రూ. 500 కొట్టి రూ. 2,500 పట్టుకెళ్తున్నారు.

హరిబౌలి చౌరస్తాలోని హెచ్.డి.ఎఫ్.సి ఏటీఎంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వార్త విన్నజనం ఏటీఎం వద్దకు భారీగా తరలివచ్చారు. అక్కడ గందరగోళం చోటు చేసుకోవడంతో స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఏటీఎంకు తాళం వేసి బ్యాంక్ అధికారులకు సమాచారం అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news