తెలంగాణ SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు షాక్‌.. అర్హత మార్కుల తగ్గింపు లేనట్లే!

-

తెలంగాణ SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు షాక్‌ ఇచ్చింది నియామక మండలి. ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి నియామక ప్రక్రియలో ఈవెంట్స్ మరో రెండు రోజుల్లో ముగియనున్నాయి. దీంతో తుది రాత పరీక్ష నిర్వహణపై టిఎస్ఎల్పిఆర్బి దృష్టి పెట్టింది.

ఈ నేపథ్యంలో ప్రైమరీ రాత పరీక్షలో వలె అర్హత మార్కులు తగ్గించే అవకాశాలు ఉన్నాయా? అనే సందేహాలు అభ్యర్థుల్లో నెలకొన్నాయి. అయితే అలాంటిదేం లేదని పోలీసు నియామక మండలి స్పష్టం చేసింది. జనరల్ అభ్యర్థులు-80, బీసీ-70, ఎస్సీ, ఎస్టీ-60 మార్కులు సాధిస్తేనే ఎంపిక అవుతారు. కాగా, డిసెంబర్‌ 16వ తేదీన పోలీస్‌ ఈవెంట్స్‌ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news