మంత్రి శ్రీనివాస్‌ కేసులో ట్విస్ట్‌.. నిందితుల రిమాండ్‌ రిపోర్ట్‌ లో కీలక విషయాలు..

-

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్ర కేసులో నిందితుల రిమాండ్‌ రిపోర్ట్‌ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీనివాస్‌గౌడ్‌ను హత్య చేసేందుకు.. సమావేశమైన రాఘవేంద్రరాజు కుటుంబ సభ్యులు.. ఆర్థికంగా ఎదగనీయకుండా చేస్తున్న శ్రీనివాస్‌గౌడ్‌ను.. హత్య చేయడమే మార్గమని అన్నదమ్ములు భావించారు.. శ్రీనివాస్‌గౌడ్‌పై కోర్టు కేసుల కోసం.. రూ.4 కోట్లు ఖర్చు చేసిన రాఘవేంద్రరాజు కుటుంబం… జిరాక్స్‌ బిల్లులకే రూ.18 లక్షలు ఖర్చు చేశారు.

శ్రీనివాస్‌ గౌడ్‌ అనుచరుడు ఆనంద్‌ను గతంలో కత్తితో పొడిచిన నాగరాజు… ఆనంద్‌, హైదర్‌అలీ, శ్రీకాంత్‌గౌడ్‌ తమను వేధిస్తున్నారని.. పోలీసులకు చెప్పారు రాఘవేంద్రరాజు బ్రదర్స్‌. తన భార్యతో పాటు తన తమ్ముళ్ల భార్యలను అరెస్ట్‌ వెనుక..మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హస్తముందని రాఘవేంద్రరాజు తెలిపారు. రాజకీయంగా వాడుకొని వదిలేసినందుకే చంపాలనుకున్నానని నిందితుడు రాఘవేంద్రరాజు నిన్న పోలీసులకు వివరించాడు.

రిటైర్డ్‌ ఆర్మీ అయిన తన తండ్రికి రావాల్సిన.. భూమి, డబ్బులను శ్రీనివాస్‌గౌడ్‌ అడ్డుకున్నారని..తాను స్థాపించిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌కు..డబ్బులు రాకుండా శ్రీనివాస్‌గౌడ్‌ అడ్డుకున్నారని చెప్పాడు. తనకు రావాల్సిన ఎమ్మెల్సీని శ్రీనివాస్‌గౌడ్‌ అడ్డుకున్నారు.. అందుకే రాఘవేంద్రరాజుకు సాయం చేయాలనుకున్నారని రిమాండ్‌ రిపోర్ట్‌లో మున్నూరు రవి తెలిపాడు. తన కూతురు క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌కు.. రూ.20 లక్షలు ఇస్తానని శ్రీనివాస్‌గౌడ్‌ మోసం చేశాడని… శ్రీనివాస్‌గౌడ్‌ మాట వినడం వల్ల నా కూతురిని పోగొట్టుకున్నానని రిమాండ్‌ రిపోర్ట్‌లో యాదయ్య వెల్లడించాడు.

Read more RELATED
Recommended to you

Latest news