ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. సచివాలయాల్లో 5 రోజుల పాటూ ఆధార్ సేవలు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు ముఖ్య గమనిక. ఐదు రోజులపాటు ఆధార్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆధార్ లో బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఐదు రోజుల పాటు స్పెషల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు.

ఈ నెల 19, 20, 21, 23, 24న సచివాలయాలు వాటి పరిధిలోని స్కూళ్లలో ఈ క్యాంపులు నిర్వహిస్తారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ జిల్లాల ఇన్చార్జ్ అధికారులు, జిల్లాల విద్యాశాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఐదు రోజులు మాత్రమే కాదు, ఫిబ్రవరిలో ఏడు నుంచి పది వరకు నాలుగు రోజుల పాటు మరోసారి ఈ క్యాంపు నిర్వహిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news