కాంగ్రెస్ లో చేరిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాజేంద్ర పాల్ గౌతమ్

-

ఢిల్లీ మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాజేంద్ర పాల్ గౌతమ్ తాజాగా కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవలే ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఆయ‌న‌ను మంత్రి పదవీ నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఆయన పార్టీకి కాస్త దూరంగానే ఉంటున్నారు.  చాలా కాలం వేచి చూసిన ఆయ‌న‌ ఈ రోజు  కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రాజేంద్ర పాల్ పార్టీని వీడ‌టం అరవింద్ కేజ్రీవాల్ వ‌ర్గానికి పెద్ద దెబ్బగా విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఎందుకంటే దీనికి ముందు మ‌రో ద‌ళిత నేత రాజ్‌కుమార్ ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరారు. మ‌రో ఆరు నెలల‌లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలోని దళితులు, ముస్లిం వ‌ర్గాలు ఆమ్ ఆద్మీ పార్టీ వెంట‌నే ఉన్నాయి. ఈ వర్గాలపై ఆయనకున్న పట్టు కారణంగా.. అరవింద్ కేజ్రీవాల్ 2014-15 నుంచి ఢిల్లీ రాజకీయాల్లో అజేయంగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news