పంజాబ్ తర్వాత ఆ రాష్ట్రాల మీద కన్నేసిన ఆప్

-

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి దక్షిణ భారత రాష్ట్రాల మీద దృష్టి సారించింది. అందుకు తగ్గట్లే దక్షిణాది లో పుంజుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని అప్ ఢిల్లీ తర్వాత పంజాబ్ లో ఘన విజయాన్ని అందుకోవడంతో దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణ చేపట్టింది. ముందుగా దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, కేరళ, తమిళనాడు మరియు పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారీగా సభ్యత నమోదు కు శ్రీకారం చుట్టింది.
తెలంగాణ రాష్ట్ర అప్ భాద్యుడిగా ఉన్న ఆ పార్టీ ముఖ్య నేత సోమనాథ్ భారతి కథనం ప్రకారం ఏప్రిల్ 14 వ తేదీన అంటే అంబేద్కర్ జయంతి రోజున తెలంగాణ లో పాదయాత్ర చేపట్టాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని అంతేకాకుండా మిగిలిన రాష్ట్రాల్లో సైతం పార్టీ పాదయాత్ర లు నిర్వహించబోతుందని పేర్కొన్నారు.
ఢిల్లీ ఆదర్శ పాలన గురించి ప్రచారం చేయడమే ఈ పాదయాత్రలు యొక్క ముఖ్య ఉద్దేశం అని ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news