ఏపీ ప్రభుత్వంపై సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు..

-

రెండేళ్లకు పైబడి సస్పెన్షన్ లో ఉండి సుప్రీంకోర్టు ఆదేశాలతో సుదీర్ఘ విరామం తర్వాత సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు గురువారం తిరిగి విధుల్లో చేరారు. టిడిపి హయాంలో ఇంటెలిజెన్స్ డీజీ గా పనిచేసిన వెంకటేశ్వరరావు నిఘా పరికరాల కొనుగోలు కేసులో అక్రమాలకు పాల్పడ్డారంటూ వైసీపీ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెన్షన్ పై సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఆయన అక్కడ అనుకూలంగా తీర్పు రావడంతో తనకు పోస్టింగ్ ఇవ్వాలంటూ రెండుసార్లు అమరావతిలోని సచివాలయానికి వెళ్లడం.. ఈ నేపథ్యంలో ఆయనపై ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేయాలని తెలిసిందే.

ఈ క్రమంలో విధుల్లో చేరేందుకు గురువారం ఆయన సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా జి.ఎ.డి లో రిపోర్టు చేసిన ఆయన ఆ తర్వాత విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఐపీఎస్ అధికారిగా తాను చేసిన పలు పనులను ఆయన ప్రస్తావించారు. రాజకీయ నేతల పై తప్పుడు కేసులు పెట్టేందుకు యత్నించిన పోలీసులను ఇట్లాంటి వెధవ పనులు చేయొద్దని వారించాను అని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా 75 ఏళ్ల వయసులో మాజీ ఎమ్మెల్సీ టిజివి కృష్ణారెడ్డి పై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసేందుకు యత్నించిన పోలీసులను తాను వారించాను అన్నారు.

ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి అన్న ఆయన తాను విపక్షానికి వత్తాసు పలుకుతున్న అంటూ ఆరోపణలు కూడా చేశారన్నారు. ఇక తన సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అసంపూర్ణంగా ఉన్నాయని వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకే తాను సిఎస్ సమీర్ శర్మను కలిసేందుకు ప్రయత్నించానని తెలిపారు. అయితే తనను కలిసేందుకు సమీర్ శర్మ విముఖత వ్యక్తం చేయడంతో జి.ఎ.డి లో రిపోర్టు చేశానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news