కేంద్రం నేరుగా పైసలు ఇవ్వడం వల్ల కెసిఆర్ కు వచ్చిన ఇబ్బంది ఏంటి: రఘునందన్ రావు

-

సీఎం కేసీఆర్ పై బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.కెసిఆర్ ఫామ్ హౌస్ లో కుంభకర్ణుడిలా నిద్ర పోయి వచ్చి కేంద్రం ఏదో చట్టాలు మార్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తండ్రి, కొడుకులకు ఎండదెబ్బ ఏమైనా తకిందా అంటూ.. ఎద్దేవా చేశారు రఘునందన్. భారతదేశాన్ని కాదు తెలంగాణ ని చూసి పెట్టుబడులు పెట్టాలని కేటీఆర్ అంటున్నారు.. అంటే తెలంగాణ ప్రత్యేక దేశం కావాలని అంటున్నారా.. అంటూ విమర్శించారు.

పంచాయతీ లో జరిగే ప్రతీ పనికి కేంద్రమే నిధులు ఇస్తుంది అన్నారు. కేంద్రం పైసలు నేరుగా ఇవ్వడం వల్ల కేసీఆర్ కు వచ్చిన నష్టం ఏమిటంటూ దుయ్యబట్టారు రఘునందన్ రావు. ఉపాధి హామీ పథకంలో డబ్బులు కొట్టేస్తున్నారు అని తెలిసినప్పుడు కరప్షన్ లేకుండా ఉపాధి హామీ కూలీలకు డబ్బులు అందాలని కేంద్రం నేరుగా వారి అకౌంట్ లో డబ్బులు వేసింది అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news