బ్రేకింగ్ : సింగరేణి ఓపెన్ కాస్ట్ 2లో ప్రమాదం.. పలు వాహనాలు ధ్వంసం?

-

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సింగరేణి కాకతీయ  ఓపెన్ కాస్ట్ 2లో ప్రమాదం జరిగింది. డంపర్ వాహనం కింద పడి భూపాలపల్లి మండలం గడ్డిగాని పల్లెకు చెందిన జడల.లింగయ్య(65) అనే గ్రామస్తుడు మృతి చెందాడు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సింగరేణి ఆస్తులను ధ్వంసం చేసిన స్థానికులు ఇంకా ఆందోళన కొనసాగిస్తున్నారు.

singareni
singareni

మృతికి నిరసనగా గ్రామస్తుల ఆందోళన చేస్తున్నారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్ లోకి చొరబడిన గ్రామస్తులు పలు వాహనాలు ధ్వంసం చేశారు. ఇక ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇక ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోకి వచ్చినట్టే చెబుతున్నారు. సింగరేణి ఉన్నతాధికారులు వచ్చి తమకు హామీ ఇస్తే కానీ ఆందోళన విరమించడం కుదరదని గ్రామస్థులు తెగేసి చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news