ఫార్మ్ హౌజ్ కేసు.. సుప్రీం కోర్టులో నిందితుడు రామచంద్ర భారతికి చుక్కెదురు

-

 

సుప్రీంకోర్టులో ఫాం హౌజ్ డీల్ కేసు విచారణ లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫాం హౌజ్ డీల్ కేసు విచారణ లో నిందితుడు రామచంద్ర భారతికి చుక్కెదురు అయింది. రామచంద్ర భారతి పిటీషన్ ను సుప్రీం కోర్టు తాజాగా కొట్టివేసింది. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో జోక్యం చేసుకునేందుకు విముఖత చూపింది సుప్రీం కోర్టు.

ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా… బెయిల్‌ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించే హక్కు ఉందని పేర్కొంది సుప్రీంకోర్టు. తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని నిందితులు రామచంద్ర భారతి, ఇతరులు దాఖలు చేసిన పిటషన్‌పై విచారణ చేపట్టారు బిఆర్‌ గవాయ్‌, విక్రమనాథ్‌. తమ రిమాండ్ ను సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు నిందితులు. నిందితుల పిటిషన్ పై గత విచారణ సందర్భంగా తెలంగాణా ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం.

Read more RELATED
Recommended to you

Latest news