‘అమూల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా జగన్’

-

శ్రీకాకుళం: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి టీడీపీ రాష్ట్ర అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధూళిపాళ్లపై ప్రభుత్వ తీరును ఆయన ఖండించారు. అమూల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా జగన్ రెడ్డి వ్యహరిస్తున్నారని అచ్చెన్న ఆరోపించారు. ఏపీ డెయిరీకి చెందిన ఆస్తులను అమూల్‌కు కట్టబెట్టడంలోనే కుట్ర బహిర్గతమైందన్నారు. గుజరాత్ సంస్థ కోసం సంగం డెయిరీ రైతులను బలి చేశారని మండిపడ్డారు. తెలుగు భాష‌పై, తెలుగువారి డైయిరీపై జగన్‌కు నమ్మకం లేదా? అని అచ్చెన్న ప్రశ్నించారు. ఏపీలో డెయిరీలను చంపేందుకు జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అమూల్‌కు పాలు రాకపోవడంతో కక్షగట్టారని చెప్పారు. బాగా నడుస్తున్న వ్యవస్థను విధ్వంసం చేయడం ఏవిధంగా న్యాయం అంటూ నిలదీశారు. అమూల్‌కు పాలుపోస్తేనే సంక్షేమ పథకాలంటూ బెదిరింపులు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ నేతలపై కక్ష సాధింపుల కోసం డెయిరీ రంగాన్నే జగన్ నిర్వీర్యం చేస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news