BREAKING : “ఆచార్య” సినిమా ఫ్రీ రిలీజ్ వేదిక మార్పు

-

ఆచార్య సినిమా ఫ్రీ రిలీజ్ వేదిక మారనుంది. ఈ నెల 23వ తేదీ విజయవాడ వేదికగా జరగాల్సిన ఆచార్య సినిమా ప్రి రిలీజ్ వేడుకను చిత్ర యూనిట్ మార్పు చేసింది. ఈ వేడుకను హైదరాబాద్ లో అదే రోజున అంటే 23 వ తేదీన నిర్వహించాలని నిర్ణయించింది. యూసఫ్‌ గూడలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ లో జరునుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది ఆచార్య చిత్ర బృందం.

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆచార్య సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ కు వస్తారని భావించి… విజయవాడలో ప్లాన్‌ చేసింది చిత్ర బృందం. కానీ.. ఈ కార్య క్రమానికి ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి… రాలేకపోవడంతో.. వేదికను మార్చుతూ.. నిర్ణయం తీసుకుంది చిత్ర బృందం. కాగా… ఆచార్య మూవీని కొరటాల శివ దర్శకత్వం చేస్తుండగా.. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు.. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ ఓ గెస్ట్‌ రోల్‌ కూడా చేయనున్నారు. కాగా.. ఈ సినిమా ఏప్రిల్‌ 29 వ తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news