సజ్జల పై ఈసీకి అచ్చెన్నాయుడు ఫిర్యాదు

-

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గీత దాటుతున్నారంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉంటూ సజ్జల రాజకీయ నేతలా మాట్లాడుతున్నారంటూ ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు.

సజ్జల ఓ వైసీపీ కార్యకర్తలా విపక్షాలపై విషం చిమ్ముతున్నారని వివరించారు. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి విపక్షాలపై ఆరోపణలు చేశారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని ఆరోపించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన సజ్జలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు కోరారు. ఈ మేరకు సీఈవోకు లేఖ రాశారు.

Read more RELATED
Recommended to you

Latest news