బాబాయి హత్యపై జాలి చూపని వ్యక్తి దేవుళ్లపై విశ్వాసం చూపుతాడా ?

-

గోవును అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం జగన్ రెడ్డికి తగదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దిగజారుడు రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని ఆయన అన్నారు. బాబాయి హత్యపై జాలి చూపని వ్యక్తి దేవుళ్లపై విశ్వాసం చూపుతాడనేది భ్రమ అని ఆయన అన్నారు. ఏ మాతాన్నీ ప్రశాంతంగా ఉండనిచ్చే వ్యక్తిత్వం జగన్ కు లేదన్న ఆయన అందుకే క్రిష్టియన్లకు క్రిస్మస్, ముస్లింలకు రంజాన్, హిందువులకు సంక్రాంతి కానుకలు దూరం చేశారని అన్నారు.

ఓ వైపు రథాలు తగలబెట్టి, విగ్రహాలను ధ్వంసం చేయించి మరో వైపు పూజల్లో పాల్గొంటున్నారని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ఏ మతంపై దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.   మతాల మధ్య మంట పెట్టి చలికాచుకునే విధానానికి వైసీపీ స్వస్తి పలకాలని ఆయన అన్నారు. మొదటి ఘటన జరిగినప్పుడే ప్రభుత్వానికి సూచించినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని ఆయన అన్నారు. నిందితులను పట్టుకోవడం చేతకాని ప్రభుత్వం రాష్టానికి అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. 

Read more RELATED
Recommended to you

Latest news