మ‌రో కమెడియన్‌కు సీఎం జగన్ కీలక పదవి

-

కమెడియన్, ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనను ‘తిరుమల శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డు’ డైరెక్టర్ పదవికి ఎంపిక చేసినట్టు ఏపీ ప్రభుత్వ వర్గాల సమాచారం. టాలీవుడ్ కమెడియన్ ’30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పృథ్వీరాజ్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే పదవిని ఇచ్చిన సంగతి తెలిసిందే. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ కు ఛైర్మన్ గా ఆయనను నియమించారు.

ఇప్పుడు మరో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డికి జగన్ ప్రత్యేక గుర్తింపును ఇచ్చారు. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డు డైరెక్టర్ పదవిని ఆయనకు ఇవ్వబోతున్నారు.ఆయనతో పాటు ప్రముఖ టీవీ యాంకర్ స్వప్నను కూడా డైరెక్టర్‌గా జగన్ సర్కార్ ఎంపిక చేసిందని సమాచారం. ఏదేమైన శ్రీనివాస్ రెడ్డికి కూడా పదవి దక్కనుండటంతో తెలుగు సినీ పరిశ్రమలో సంతోషం వ్యక్తమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news