Namitha : శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ నమిత

-

సీనియర్‌ హీరోయిన్‌ నమిత శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఆయన భర్తతో కలిసి వచ్చిన నమ్రత… తిరుమలలో సందడి చేసింది. ఉదయం వీఐపీ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్న వీరిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం హీరోయిన్‌ నమ్రత మీడియాతో మాట్లాడారు. తను నటించిన ”బౌ బౌ” సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

థియేటర్లలో విడుదల చేయాలా ? వద్దా ? లేదా ఓటీటీలో చేయాలా అనేది నిర్ణయం తీసుకోలేదని… దానిపైనే సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

నమితా థియేటర్‌ పేరుతో ఓటీటీ… నమిత ప్రొడక్షన్స్‌ ప్రారంభిస్తున్నామని ఆమె వెల్లండిచారు. దీనిపై అతి త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పారు నమిత. కాగా… జెమిని, సింహా, బిల్లా లాంటి సినిమాల్లో నమిత…  టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించింది.  ఆ తర్వాత తెలుగు పరిశ్రమలో ఎక్కువగా ఛాన్స్‌ లు రాక… తమిళ సినిమాలు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news