కృష్ణంరాజు విషయంలో తన మద్దతు రాంగోపాల్ వర్మకే అంటున్న నటి..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటులలో ఒకరైన కృష్ణంరాజు ఈనెల 11వ తేదీన అనారోగ్య కారణం చేత మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులను సైతం ఎంతగానో నిరుత్సాహపరిచింది. ఇక ప్రముఖ నటి శివపార్వతి తాజాగా ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ పలు విషయాలను సైతం తెలియజేసింది. నాటకం అనేది కేవలం ఒక వినోదాన్ని మాత్రమే అందిస్తుందని ఆమె తెలియజేస్తుంది . ఎవరు ఏం చెప్పాలనుకున్నా ప్రజలలోకి ఆ విషయం వెళ్లాలన్నా.. అది కేవలం నాటకం వల్లే చేరుతుంది అని శివ పార్వతి తెలియజేసింది.

కృష్ణంరాజు మృతి పై రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ ను నేను చూశాను. ఆ విషయంలో మాత్రం నేను వర్మని ఏకీభవిస్తానని ఆమె తెలియజేసింది. కృష్ణంరాజు ఒక లెజెండరీ నటుడు అని రియల్ లైఫ్ లోనే కాకుండా రీల్ లైఫ్ లో కూడా హీరోగా ఉన్నారని శివపార్వతి కామెంట్స్ చేయడం జరిగింది. కృష్ణంరాజు గారు తన పర్సనల్ లైఫ్ ని మాత్రం చాలా తక్కువగా అనుభవించారని తను అనుకుంటున్నట్లుగా తెలియజేసింది. సినీ రంగం కోసం ఆయన చాలా కష్టపడ్డారని.. అలా ఎంతో సేవ చేసిన ఆయన మరణించిన తర్వాత అసలు గౌరవం ఇవ్వలేదని ఆమె అభిప్రాయంగా తెలియజేసింది.

కనీసం ఒక్కరోజు షూటింగ్ అయిన ఆపొచ్చు కదా అని తన మనసులో మాట చెప్పింది.. లేకుంటే హాఫ్ డే షూటింగ్ అయిన ఆపి ఉంటే బాగుండేదేమో అన్నట్లుగా ఆమె తెలియజేసింది. అలా జరగకపోవడం నిజంగా బాధపడాల్సిన విషయం ఇది అని శివపార్వతి తెలియజేస్తోంది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సైతం చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక రెబల్ స్టార్ అభిమానులు కూడా ఈ విషయాన్ని ఏకీభవిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news