లాక్ డౌన్ ఎఫెక్ట్.. దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన త్రిష..!

-

కరోనా లాక్‌ డౌన్ కారణంగా ఇప్పుడు ఆడియెన్స్ థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు. అందరూ ఓటీటీ బాట పట్టారు. దర్శకులు, నిర్మాతలు అందరూ ఓటీటీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు దీంట్లో విడుదలయ్యాయి. దీంతో చాల మంది స్టార్స్ వెబ్ సిరీస్‌ లో నటించే ఆలోచన చేస్తున్నారు. పారితోషికం కూడా సంతృప్తికరంగా, ఆకర్షణీయంగా ఉండడంతో చాలామంది హీరోయిన్లు వెబ్ సీరీస్ లో నటించడానికి ముందుకు వస్తున్నారు.

ఇప్పటికే సమంత, కాజల్ వంటి భామలు వెబ్ సిరీస్‌ లో నటించాలని ప్లాన్ చేస్తుండగా… తాజాగా సౌత్‌ స్టార్‌ త్రిష కృష్ణన్‌ నిర్మాత ఆనంద వికటన్ నిర్మించే ఓ వెబ్ సిరీస్‌ లో నటించిందేందుకు కమిట్ అయింది. ఈ సిరీస్‌ కు సుబ్రహ్మణ్యన్ దర్శకత్వం వహించనున్నారు. తండ్రి, కూతుళ్ల అనుబంధం కథాంశంగా తెరకెక్కే కథాంశంతో ఈ సిరీస్‌ తెరకెక్కబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news