డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం లేదు: నటి వరలక్ష్మి శరత్ కుమార్

-

ఈ రోజుల్లో డ్రగ్స్ కల్చర్ ఎంతలా ఇండియాలో పాతుకుపోయింది అంటే… ఆటవస్తువులులాగా లేదా ఏదైనా తినుబండారం లాగా సమాజంలో అమ్మేస్తున్నారు. ముఖ్యంగా కాలేజ్ చదివే కుర్రాళ్ళ నుండి బాగా డబ్బున్న ధనవంతులు ఈ డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారు. కాగా గతంలో హైదరాబాద్ లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన డిపార్ట్మెంట్ లు ఎందరినో విచారించి సంబంధం ఉన్న వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కు కూడా డ్రగ్స్ తో సంబంధం ఉందని తనకు నోటీసులు అందాయన్న వార్త సోషల్ మీడియాలో ప్రచారం అవడంతో దీనిపై ఆమె స్వయంగా మీడియా ముందుకు వచ్చి స్పందించడం విశేషం.. ఈమె మాట్లాడుతూ నాకు ఈ డ్రగ్స్ కేసుతో కానీ లేదా నోటీసులతో కానీ ఎటువంటి సంబంధం లేదు.

గతంలో నా దగ్గర ఫ్రీలాన్స్ మేనేజర్ గా పనిచేసిన ఆదిలింగం అనే డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో నా పేరును బయటకు తీసుకువచ్చారు.. అంతే కానీ నాకు ఎటువంటి నోటీసులు డిపార్ట్మెంట్ లు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news