Adilabad: ఎంపీ సీటుపై సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు….

-

మరి కొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది . ఈ నేపథ్యంలో వివిధ రాజకీయా పార్టీలకు చెందిన నేతలు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు.అయితే తాజాగా పార్లమెంట్ ఎంపీ టికెట్‌పై బీజేపీ నేత, ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గల్లీకో ఫ్లెక్సీ పెడితే టికెట్‌ రాదని , క్యాడర్‌ లేనోడు లీడర్‌ కాలేడని వ్యాఖ్యానించారు.

 

తనపై కొందరు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని,బీజేపీ ఎంపీ టికెట్‌ అంగట్లో సరుకు కాదని ఆయన అన్నారు. ఎంపీగా  నేను ఏం చేశానో పార్టీ అధిష్ఠానానికి తెలుసని అన్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌ ఎంపీగా ఉన్న ఉన్న సోయం బాపురావుకు  ఈసారి బిజెపి తరఫున టికెట్ వస్తుందా? లేదా? అనేది కొద్దిరోజులుగా చర్చ జరుగుతోంది. ఇటీవల బోథ్‌ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన సోయం దారుణంగా ఓడిపోయారు. పైగా ఆదిలాబాద్‌ ఎంపీ సీటు కోసం సాకటి దశరథ్‌, మాజీ ఎంపీ రాథోడ్‌ రమేశ్‌ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్‌ ఎంపీ సీటు బీజేపీ ఎవరికి కేటాయిస్తుందనే విషయంపై చర్చ జరుగుతోంది. అయితే సోయం మాత్రం తనకే బీజేపీ ఎంపీ టికెట్‌ ఇస్తుందనీ ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news