దత్త పుత్రుడి మియావ్ మియావ్..! – పవన్ కి గుడివాడ అమర్నాథ్ కౌంటర్

-

దేనికి గర్జనలు? అంటూ వైసీపీ ప్రభుత్వం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ” కౌలు రైతులకు మొండి చేయి చూపించినందుకా? వ్యవసాయ రంగాన్ని వదిలేసి, సాగు మోటార్లకు మీటర్లు పెడుతున్నందుకా? పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయలేకపోయినందుకా? నిర్వాసితులను గాలికొదిలేసినందుకా?

కక్ష సాధింపు రాజకీయాలతో తప్పుడు కేసులుపెట్టిస్తున్నందుకా? పోలీసు వ్యవస్థ చేతులు కట్టేసినందుకా?
ఇసుకను అడ్డగోలు దోచుకొంటున్నందుకా? ఈ దోపిడీ కోసమే స్పెషల్ పాలసీ చేసుకున్నందుకా? మట్టి కూడా తినేస్తున్నందుకా? ‘సంపూర్ణ మద్య నిషేధం’ అద్భుతంగా అమలు చేస్తున్నందుకా? ‘మద్య నిషేధం’ ద్వారా ఏటా రూ.22 వేల కోట్లు సంపాదిస్తున్నందుకా? ‘మద్య నిషేధ’ ఆదాయం హామీగా రూ.8 వేల కోట్లు అప్పు తెచ్చినందుకా?

151 మంది ఎమ్మెల్యేలు, 22మంది లోక్ సభ సభ్యులు, 9మంది రాజ్యసభ సభ్యుల బలంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాల్సింది కాస్తా అప్పుల బాట పట్టించినందుకా?” అని ఆయన ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇచ్చారు. ” దత్త తండ్రి చంద్రబాబు తరఫున దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ మియావ్ మియావ్..!” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news