వివాహిత కోసం యువకుడి ఆత్మహత్య..

-

రోజురోజుకు వివాహేతర సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి. వావీవరసలు, వయోభేదాలు మరిచి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇటీవల వెలుగు చూసిన చాలా హత్యల్లో వివాహేతర సంబంధాలే ప్రధాన అంశంగా ఉన్నాయి. తాజా వివాహేతర సంబంధం కారణంగా మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే…

మహబూబ్ నగర్ జిల్లాలో ఓ యువకుడు వివాహిత కోసం ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం కలిగించింది. జిల్లాలో దేవరకద్ర మండలం గోపన్ పల్లిలో ఉంటున్న యువకుడికి.. అదే గ్రామానికి చెందిన వివాహితకు మధ్య అక్రమసంబంధం ఏర్పడింది. ఈ విషయం బయటకు తెలియడంతో 20 రోజుల క్రితం యువకుడు, వివాహిత ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో మహిళ చనిపోగా.. యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో అప్పటి నుంచి సదరు యువకుడు తీవ్ర మనస్థాపంతో కుమిలిపోతున్నాడు. మహిళ చనిపోవడంతో కుంగిపోయాడు. మహిళ ప్రాణాలతో లేదని పదేపదే తలుచుకుంటూ తనువు చాలించాడు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రోజున చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news