పార్లమెంట్ ఎన్నికల తర్వాత….తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ – డా. లక్ష్మణ్

-

మా ప్రభుత్వాన్ని కూల్చడానికి చూస్తున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రతిపక్ష పార్టీలపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే సీఎం రేవంత్ రెడ్డి వాఖ్యల పై బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్ మరోసారి స్పందించారు.రేవంత్ కు ఎందుకు అంత అభద్రతా భావం..? అని ప్రశ్నించారు.హైదరాబాద్ లోని హమారా సంకల్ప్ వికసిత్ భారత్ ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ కార్యక్రమంలో భాగంగా హోటల్ కత్రియాలో ఏర్పాటు చేసిన అడ్వకేట్స్ మీట్ కార్యక్రమంలో లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది అని ఎన్నికల ప్రక్రియ ద్వారానే రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం అని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే ఇండియా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమన్నారు. ప్రజల యొక్క మనోగతాన్ని తీసుకుని మ్యానిఫెస్టోలో తయారు చేయడానికి బీజేపీ సిద్ధం అయ్యిందని తెలిపారు. అందులో భాగంగానే ప్రజలు, మేధావులు, వెనుక బడిన వర్గాల సలహాలు తీసుకోవడానికి ముందుకు వచ్చామని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news