మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయము : పవన్ కళ్యాణ్

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో దుష్టపాలన అంతం కాబోతోందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు.చిలకలూరిపేటలోని బొప్పూడి వద్ద ఏర్పాటుచేసిన ప్రజాగళం సభ లో పాల్గొన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖాయమయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికల సభ.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…..అభివృద్ధి లేక, అవినీతి, అరాచక పాలనతో కొట్టుమిట్టాడుతోన్న రాష్ట్రానికి అండగా నిలిచేందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతున్నామన్నారు. మోదీ రాక కోసం ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూశారని తెలిపారు. తమ కూటమికి దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నాయని ఆయన తెలిపారు. మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news