Akhanda : “అఖండ” సినిమాకు తరలివచ్చిన అఘోరాలు

-

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా డిసెంబర్ 2వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో… రెండు రాష్ట్రాల్లోనూ… కలెక్షన్ల వర్షం కురుస్తోంది. బోయపాటి శ్రీనివాస్, నందమూరి బాలయ్య హిట్ కాంబినేషన్ లో హైట్రిక్ విజయం సాధించడంతో నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇటు  ఈ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసల కురిపిస్తూనే ఉన్నారు. ఇలాంటి తరుణం లో… విశాఖ జిల్లా నర్సీపట్నం లోని ఓ థియేటర్ లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. నర్సీపట్నం లోని ఓ థియేటర్ కు అఖండ సినిమా చూసేందుకు ఏకంగా అఘోరాలు వచ్చేసారు. శరీరానికి విభూతి అలాగే తాయత్తు లతో థియేటర్ కు వచ్చేశారు. నందమూరి బాలయ్య అభిమానులతో కలిసి సినిమా చూశారు. శివ నామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ అఖండ  మూవీ తో అఘోరాలు కూడా బాలయ్య అభి మానులు అయిపోయారు అంటూ ఫాన్స్ ఫిదా అయి పోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news