తెలంగాణలో పంట నష్టంపై వ్యవసాయ శాఖ సర్వే ప్రారంభము

-

నాలుగు ,ఐదు రోజుల పాటు కురిసిన అకాల వర్షాలకు పండిన పంటలు నీటి పాలవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతకష్టపడినా కష్టాలు, కన్నీళ్లు, అప్పులు మాత్రమే మిగులుతున్నాయే తప్ప ఒక్క రూపాయి కూడా ఆదాయం పొందే దాఖలాలు కన్పించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు ,ఐదు రోజుల పాటు కురిసిన అకాల వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది.పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు శనివారం సర్వే చేపట్టారు.

ఈ నేపథ్యంలో శనివారం నుంచి రాష్ట్రంలోని నిజామాబాద్, కామారెడ్డి ,కరీంనగర్, మెదక్, సిద్దిపేట, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్,రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాలను వ్యవసాయ శాఖ అధికారులు సందర్శించి జరిగిన పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు.ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఫీల్డ్ లెవల్ సర్వేను నిర్వహిస్తున్నారు. ఈ నష్టాన్ని లెక్కించి పార్లమెంట్ ఎన్నికల తర్వాత రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ అందించాలని నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Latest news