షేక్పేటలో ఉద్రిక్తత..బీజేపీ అభ్యర్ధిని రక్తం వచ్చేలా కొట్టిన ఎంఐఎం కార్యకర్తలు !

-

గ్రేటర్ ఎన్నికల్లో చాలా చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ప్రశాంతంగా ఓటింగ్ జరిగిన ప్రాంతాల్లో కూడా ఈ రోజు గొడవలు జరుగుతున్నాయి. తాజాగా షేక్ పేటలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఎంఐఎం నాయకులు రిగ్గింగ్ కు  పాల్పడుతున్నారని అడ్డుకున్న బీజేపీ నాయకులపై విచక్షణ రహితంగా దాడి చేశారని అంటున్నారు. ఏకంగా రక్తాలు కారేలా కొట్టుకున్నట్టు చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి చెరక మహేష్, అభ్యర్థి తమ్ముడు, అభ్యర్థి అనుచరులు అందర్ని చితకబాదారని సమాచారం అందుతోంది.

ఇక పాత బస్తీ లోని ఘన్సీ బజార్ వద్ద కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ, ఎంఐఎం కార్యకర్తలు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో రెండు వర్గాలును చెదరగొట్టిన పోలీసులు అక్కడ ఎవరూ లేకుండా పంపేశారు. గత GHMC ఎన్నికల్లో ఘన్సీ బజార్ డివిజన్ లో బీజేపీ అభ్యర్థి గెలిచారు. దీంతో ఈసారి ఎలా అయినా ఆ సీటును గెలవాలని ఎంఐఎం చూస్తోంది. 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news