‘మట్టికుస్తీ’ బ్యూటీ అందర్ని భలే ఫూల్ చేసిందిగా

-

అమ్ము, మట్టికుస్తీ, పొన్నియన్ సెల్వన్ వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది మలయాళ కుట్టి ఐశ్వర్య లక్ష్మి. ఈ బ్యూటీ అందంతో పాటు సినిమాల ఛాయిస్ చూసి తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. అందుకే ఈ భామ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఐశ్వర్య రీసెంట్‌గా కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్‌తో దిగిన సెల్ఫీని పోస్ట్ చేసింది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు ఐశ్వర్య లక్ష్మి-అర్జున్‌ దాస్‌ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకునేందుకు రెడీ అవుతున్నారంటూ జోరుగా చర్చించుకోవడం మొదలుపెట్టారు.

ఈ నేపథ్యంలో తన పోస్టుపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది ఐశ్వర్య లక్ష్మి. ‘హాయ్‌ నేను పెట్టిన పోస్ట్ ఇంతలా పేలుతుందని ఊహించలేకపోయా. మేమిద్దరం (అర్జున్‌దాస్‌-ఐశ్వర్యలక్ష్మి) కలుసుకున్నపుడు దిగిన సెల్ఫీని ఇలా పోస్ట్‌ చేయడం జరిగింది. మేం స్నేహితులం. నాకు నిన్నటి నుంచి మెసేజ్‌లు పంపుతున్న అర్జున్‌ దాస్‌ అభిమానులు ప్రశాంతంగా ఉండండి.. అర్జున్‌ దాస్ మీ అందరివాడు..’ అంటూ పుకార్లకు చెక్‌ పెట్టింది ఐశ్వర్య లక్ష్మి.

Read more RELATED
Recommended to you

Latest news