అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్న ఐశ్వర్యరాయ్..!!

-

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ గురించి.. ఆమె అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇక ఆమె కళ్ళే ఆమె అందానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటాయి. ఇక ఎంతోమంది కలల రాకుమారిగా, మిస్ యూనివర్స్ గా అమితాబ్ బచ్చన్ కోడలిగా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్యారాయ్ తాజాగా అంతుచిక్కని వ్యాధితో బాధపడుతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఈ వ్యాధి కారణంగానే ఆమె నటిస్తున్న పొన్నియన్ సెల్వన్ ఈవెంట్ నుంచి వెళ్ళిపోయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఐశ్వర్యరాయ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. టాలీవుడ్ , బాలీవుడ్ అని తేడా లేకుండా ప్రతి సినిమాలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. తనకు హీరోయిన్ గా మంచి లైఫ్ ఇచ్చిన తమిళ సినిమాల్లో మాత్రం అడగ్గానే ఒప్పేసుకుంటూ ఉంటుంది. ఇక 2010లో వచ్చిన రోబో లో రజనీకాంత్ కి జోడిగా ఆడి పాడి అలరించింది. ఇక తర్వాత సౌత్ సినీ ఇండస్ట్రీ వైపు చూడలేదు. ఇక చాలాకాలం తర్వాత తమిళ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించింది ఐశ్వర్య. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి భారీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసినప్పుడు అందులో పాల్గొన్న ఐశ్వర్యరాయ్ మధ్యలోనే వెళ్లిపోయింది.

Actor Aishwarya Rai Bachchan appears before ED in 'Panama Papers' leak case- The New Indian Express

ఇక ఈ కారణంగానే ఆమెపై ఎక్కువ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోని చల్లని పదార్థాలు తింటే చాలామందికి జలుబు వస్తుందని.. ఇమ్ము ఉంటుందని అంటారు. కానీ ఐశ్వర్యరాయ్ కి ఉన్న జబ్బు ప్రకారం కూల్ వాటర్ తాగితే స్కిన్ ప్రాబ్లం వచ్చేస్తుందట. అంతేకాదు శరీరం మొత్తం ఎర్రగా మారిపోయి.. దురద కూడా మొదలవుతుందని.. ఇలాంటి భయంకరమైన అలర్జీతో బాధపడుతుందట. ఇక ప్రస్తుతం కూల్ వాటర్ , కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ వంటి చల్లని పదార్థాలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఇక అనుకోకుండా ట్రైలర్ ఈవెంట్లో కూల్ వాటర్ తాగడంతో ఇబ్బంది మొదలైనట్లు అందుకే అక్కడి నుంచి ఆమె వెళ్లిపోయినట్లు సమాచారం. ఇకపోతే మేకప్ కిట్ తో పాటు మెడికల్ కిట్ కూడా తప్పనిసరిగా ఈమెతో ఉండాల్సిందే అంటూ ఐశ్వర్యారాయ్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు బాధపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news