మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌.. ర‌హానే సెంచ‌రీ, పొగ‌డ్త‌ల్లో ముంచెత్తుతున్న నెటిజ‌న్లు..

-

ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ ప‌ట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల న‌ష్టానికి 277 ప‌రుగులు చేసి ఆసీస్‌పై 82 ప‌రుగుల ఆధిక్యంలో కొన‌సాగుతోంది. కాగా భార‌త ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ర‌హానే మ‌రో టెస్టు సెంచ‌రీ చేశాడు. దీంతో నెటిజ‌న్లు ర‌హానేను పొగ‌డ్త‌ల్లో ముంచెత్తుతున్నారు.

ajinkya rahane makes test century netizena hail him

రెండో టెస్టు మ్యాచ్‌లో ర‌హానే, జ‌డేజాలు 6వ వికెట్ చ‌క్క‌ని భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. వారి పార్ట్‌న‌ర్ షిప్ ప్ర‌స్తుతం 104 ప‌రుగుల వ‌ద్ద కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో ర‌హానే టెస్టుల్లో 12వ సెంచరీని పూర్తి చేశాడు. మొత్తం 200 బంతులు ఆడిన ర‌హానే 12 ఫోర్లతో 104 ప‌రుగులు చేసి అజేయంగా ఆడుతున్నాడు. ఇక జ‌డేజా కూడా 104 బంతుల్లో 1 ఫోర్‌తో 40 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద కొన‌సాగుతున్నాడు.

కాగా ర‌హానే ప్ర‌స్తుతం టెస్టు సిరీస్‌కు స్టాండిన్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. కోహ్లి గైర్హాజ‌రు నేప‌థ్యంలో ర‌హానే భార‌త టెస్టు క్రికెట్ జ‌ట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. దీంతో కెప్టెన్ ర‌హానే సెంచ‌రీ పూర్తి చేశాడ‌ని నెటిజ‌న్లు అత‌న్ని పొగడ్త‌ల్లో ముంచెత్తుతున్నారు. 150 ప‌రుగుల‌కు పైగా ఆధిక్యం తీసుకువ‌చ్చి ఆసీస్‌పై ప్రెజ‌ర్ పెట్టాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news