ఇంకా ఎన్ని రోజులు చెక్కు తారు అంటున్న అఖిల్ ఫ్యాన్స్.!

-

హీరో అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “ఏజెంట్”. ఈ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తోంది.ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్  ను ఖచ్చితం గా సంక్రాతికి రిలీజ్ చెయ్యాలని మేకర్స్ చూస్తున్నారని, ప్రస్తుతం దీనిపై చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ప్రయత్నంలో వారికి దారుణ మైన దెబ్బలు తగులతాయి అని విరమించుకున్నారు.

చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది. కాని ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ తడిసి మోపెడు అయ్యింది. మొదటే పాన్ ఇండియా టార్గెట్ అని చేసిన సీన్లు చాలా వరకు మళ్లీ చిత్రీకరణ చేశారు ఈ మూవీ షూటింగ్ లో అఖిల్ గాయపడటం.. ఆ తరువాత సురేందర్ రెడ్డి గాయపడటం వంటి కారణాలతో మళ్లీ ఆలస్యం అవుతూ ఉంది.

దీంతో ప్రొడ్యూసర్ అనిల్ సుంకరపై భారం పెరుగుతోందని బడ్జెట్ చుక్కలని అంటుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకోవాలని అఖిల్ భారీ పట్టుదలతో వున్నాడు. కానీ సురేందర్ రెడ్డి మాత్రం టైమ్ దాటినా ఇప్పటికీ చెక్కేస్తూ టైమ్ వేస్ట్ చేస్తున్నాడనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇంకా ఇన్ని రోజులు రాజమౌళి లాగ చెక్కడం ఏంటని అఖిల్ అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news