అక్షయ్ కుమార్ కు అస్వస్థత ? హాస్పిటల్ లో చేరిక !

-

దేశంలో  క‌రోనా  సెకండ్ వేవ్ దృష్ట్యా కేసులు క్రమక్రంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే సినీ ప్ర‌ముఖులు చాలా మంది ఈ వైర‌స్ బారిన ప‌డిన సంగతి తెలిసిందే. నిన్న బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం డాక్టర్ల  సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నా అని పేర్కొన్న ఆయన గత వారం రోజులుగా తనను కలిసి వాళ్లు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరాడు.

అయితే ఆయనకు స్వల్ప అస్వస్థత చోటు చేసుకుందని అందుకే ఆయనను ఆసుపత్రికి తరలించారని చెబుతున్నారు. తాను హాస్పిటల్ లో చేరిన అంశాన్ని కూడా అక్షయ్ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే తాను హాస్పిటల్ లో చేరానని చెప్పుకొచ్చారు. నేను బాగానే ఉన్నానని పేర్కొన్న ఆయన  ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే తాను హాస్పిటల్ లో చేరానని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news