అల వైకుంఠపురములో ట్రెయిలర్… ఫస్ట్ రివ్యూ మీకోసం !!

-

త్రివిక్రమ్ దర్శకత్వం లో – అల్లూ అర్జున్ హీరో గా రాబోతున్న మూడవ సినిమా అల వైకుంఠపురములో .. ఈ సినిమా కి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కాకుండా స్పెషల్ గా ప్లాన్ చేశాడు అల్లూ అర్జున్. నిజానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ల ఐడియా స్టార్ట్ అయ్యిందే అల్లూ అర్జున్ సినిమా సరైనోడు నుంచి అని చెప్పాలి. సరే విషయానికి వస్తే ఈ సినిమా ట్రెయిలర్ విడుదల ఐన దగ్గర నుంచీ ఇంటర్నెట్ లో షికారు చేస్తోంది.

బన్నీ ని పూర్తి పాష్ లుక్ లో చూపించాడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. తన సహజ సిద్ధమైన కామెడీ కి భిన్నంగా బన్నీ ఈ సినిమా లో పూర్తి క్లాస్ కామెడీ పండించేలాగా కనిపిస్తుంది. అల్లు అర్జున్ ఒక మిడిల్ క్లాస్ ఫామిలీకి చెందిన కుర్రాడిగా కనిపిస్తాడు .. మురళీ శర్మ అతని తండ్రి .. గొప్పలకి పోకుండా ఉండాలి అని తండ్రి చెప్తుంటే వినని కొడుకుగా బన్నీ బాగా చేశాడు. టబూ ఆఫీస్ లో ఇతను ఎలా జాయిన్ అయ్యాడు , పూజా హెగ్డే పాత్ర ఏమిటి అనేది సస్పెన్స్ గా పెట్టారు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. డైలాగ్స్ మాత్రం చాలా బాగా వచ్చాయ్ అని చెప్పచ్చు. పూజా హెగ్డే వైపూ చూపిస్తూ ” దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంటుంది .. ఒకటి నేలకి రెండు వాళ్ళకి ” అంటూ అల్లూ అర్జున్ చెప్పే డైలాగ్ అద్దిరిపోయింది .. ఆఖర్లో విజిల్స్ ఏం సరిపోతే చాలా పెద్ద బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కోటు గాల్లో ఎగరడం అలా ఉంటుంది అని చెప్తాడు ఆ డైలాగ్ కూడా సూపర్ గా ఉంది. ” పులి వచ్చింది మేక చచ్చింది ” డైలాగ్ కూడా సెట్ అయ్యింది బాగా .. ఈ సినిమా ఆద్యంతం ఫామిలీ లని అలరించేలా అనిపిస్తోంది.

డైలాగ్స్ నుంచి ఫైట్స్ వరకూ ఇలా అనేక అంశాలు ట్రెయిలర్ లో కనిపిస్తాయి. పూజ హెగ్డే ఈ స్టోరీ కి ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి. ఆమె చుట్టూనే కథ మొత్తం నడుస్తున్నట్టు అనిపిస్తోంది మరి. ఇతర తారాగణం, డైలాగులు, డాన్స్ లూ, పాటలు, ఫైట్ లూ ఇలా అన్నింటా త్రివిక్రమ్ మార్క్ స్పష్టం గా కనిపిస్తోంది. రీసెంట్ గా విడుదల ఐన సరిలేరు నీకేవ్వరు ట్రెయిలర్ కి అల వైకుంఠపురములో ట్రెయిలర్ గట్టి పోటీ ఇస్తోంది అని చెప్పాలి. థియేటర్ లో ఇంకెంత పోటీ ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news