మీడియాపై ఆలియా భట్ ఫైర్.. నా ఇంట్లో కెమెరా పెడతారా అంటూ

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మీడియాపై తీవ్రంగా ఫైర్ అయింది. ఓ ఇద్దరు వ్యక్తులు ఏకంగా కెమెరాలతో తన ఇంటిని ఫోకస్ చేశారని మండిపడింది. నా ఇంట్లోనే కెమెరా పెడతారా.. అసలు మీకు బుద్ధుందా అంటూ ఘాటుగా రియాక్ట్ అయింది.

అసలేం జరిగిందో అలియా తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది ఆలియా. ‘‘‘మీరు నన్ను ఆట పట్టిస్తున్నారా? నేను ప్రశాంతంగా నా ఇంటి వద్ద కుటుంబంతో గడుపుతున్నాను. ఎవరో నన్ను గమనిస్తున్నట్లు అనిపించింది. పక్కకు చూస్తే ఎవరో ఇద్దరు వ్యక్తులు మా పక్క ఇంటి డాబాపై నుంచి నన్ను కెమెరాతో వీడియో తీస్తున్నారు. ఇది సరైనదేనా..? ఒకరి వ్యక్తిగత విషయాలపై గోప్యత పాటించరా? ఎలాంటి వారి మధ్య అయినా దాటకూడని గీత ఉంటుంది. మీరు ఈరోజు ఆ గీత దాటారు. మీరు మీ హద్దులు దాటి ప్రవర్తించారు’’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ ఇన్‌స్టా పోస్టులో ముంబయి పోలీసులను ట్యాగ్‌ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. దీనిపై పలువురు సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news