వైసీపీ పార్టీ కార్యాలయానికి RTC స్థలం కేటాయింపు !

-

ఏపీ ప్రభుత్వం మరో వివాదానికి తెరలేపింది. ఏపీఎస్ఆర్టీసీకి చెందిన స్థలాన్ని వైసీపీ కార్యాలయానికి కేటాయించడం పై అభ్యంతరం వ్యక్తం చేసిన బాపట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరెడ్డిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. కేంద్ర కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

పార్టీ కార్యాలయం, శంకుస్థాపన సమయంలో మంత్రుల ముందే శ్రీనివాసరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై అప్పుడే పోలీసులు రెవెన్యూ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆయన తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. తాజాగా ఆయనపై చర్యలు తీసుకుంటూ కేంద్ర కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో చీరాల ఆర్టీసీ డిపో మేనేజర్ ని బాపట్ల డిపో ఇన్చార్జిగా నియమించారు. అయితే, ప్రభుత్వ ఆదేశాలతోనే శ్రీనివాస్ రెడ్డి పై చర్యలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news