Allu Arjun: బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ..! బ‌న్నీ, త్రివిక్రమ్ కాంబోలో నాలుగో సినిమా..!

-

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉంది. సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ.. కెరీర్‌లో దూసుకపోతున్నాడు. ప్ర‌స్తుతం సుకుమార్‌తో చేస్తున్న ‘పుష్ప’ సినిమా చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం లో డిసెంబ‌ర్ చివ‌రి వారంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది.
నెక్స్ బోయపాటి శ్రీనుతో బన్నీ నెక్స్ట్ మూవీ చేసే అవకాశముందట‌. ఆ త‌రువాత కొరటాలతో క్రేజీ ప్రాజెక్టు చేయ్యాల్సి ఉన్నా.. ఆ సినిమా నుంచి తప్పిపోవడంతో నెక్ట్స్ సినిమా ఎప్పుడు ఎవరితో? అనే చర్చలు జరుగుతున్నాయి.

ఈ క్ర‌మంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ పోస్ట్ ఒక‌టి వైర‌ల్ అవుతుంది. దీంతో ప‌లు ఊహాగానాలు వెల్లువెతున్నాయి. వారి క్రేజీ కాంబినేష‌న్ రిపిట్ కానున్న‌దా?
అనే సందేహాలు వెలువ‌డుతున్నాయి. ఇంత‌కీ ఆ పోస్టు ఏంటీ.. వైర‌ల్ కావ‌డానికి గ‌ల కార‌ణ‌మేమిటీ అందులో ఏం చెప్పార‌ని మీ కోసం..

వివరాల్లోకెళ్తే… వరుడు కావలెను’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్,
అల్లు అర్జున్, సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్, నాగ వంశీలతో కలిసి ఫోటో దిగారు. ఈ ఫోటోను సోష‌ల్ మీడియా వేదికగా షేర్ చేశారు నాగవంశీ. త్వరలోనే ఓ సర్ప్రైజ్ రాబోతోందని రాసుకోచ్చారు. అలాగే ఈ పోస్టును హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ ని ట్యాగ్ చేయడంతో ‘అల వైకుంఠపురములో’ కాంబోలో మళ్ళీ రిపీట్ కానుందని అందరూ ఫిక్స్ అయ్యారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స‌క్సెస్ పుల్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సార్ట్ ప్రొడ్యూసర్ రాధాకృష్ణ (చినబాబు) లది సూప‌ర్ సక్సెస్ పుల్ క్రేజీ కాంబినేషన్ అని చెప్పాలి. ఇప్పటి వ‌ర‌కూ వీరి కాంబోలో వచ్చిన
‘జులాయి, ‘సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠ‌పురం చిత్రాల‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్షేషనల్ హిట్ తో రికార్డ్స్ క్రియేట్ చేశారు. దీంతో వీరి సూపర్ హిట్ కాంబోలో నాలుగో సినిమా రాబోతోందని హింట్ వచ్చిందని అభిమానులు భావిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news