నిర్మాతలకు దర్శకులకు షాక్ ఇచ్చిన అల్లు అర్జున్…!

-

అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో… సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. దాదాపు 150 కోట్లకు పైగా ఈ చిత్రం షేర్ వసూలు చేసింది. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం ఇది. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎక్కువగా ఈ సినిమా ఆకట్టుకుంది అనేది వాస్తవం.

ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ పెరిగింది. ఈ సినిమా కోసం అతను దాదాపుగా 15 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమా సూపర్ హిట్ కావడం ఇప్పుడు అతను ధరను భారీగా పెంచాడని అంటున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో అతను దాదాపుగా 20 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడు. ఈ సినిమా కరోనా ప్రభావం తగ్గిన తర్వాత సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మంధన నటిస్తుంది. ఈ సినిమా కథ ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ మధ్య ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమా కూడా ఆ విధంగానే ఉండే అవకాశం ఉంది. పగ నేపధ్యంలో ఈ సినిమా ఉంటుంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news