పండగ రోజు కూతురు అల్లుడుతో కలిసి అమరావతికి బాలకృష్ణ…!

-

ఏపీ రాజధాని గ్రామాల్లో రాజధాని ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజుల నుంచి అక్కడి ప్రజలు, రైతులు, మహిళలు అందరూ రోడ్ల మీదకు వచ్చి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ తమ భవిష్యత్తుని కాపాడాలని రోడ్లకు మీదకు వస్తున్నారు ప్రజలు.

ఈ నేపధ్యంలో వారికి రాజకీయంగా వ్యక్తిగతంగా పలువురు మద్దతు తెలుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ వారికి అండగా పోరాటం చేస్తుంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత ఊరు వెళ్ళకుండా అమరావతిలోనే ఉన్నారు. నందమూరి, నారా కుటుంబాలు కలిసి రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపాయి. బుధవారం సంక్రాంతి సందర్భంగా భార్య భువనేశ్వరి తో కలిసి చంద్రబాబు వెళ్ళారు.

ఇక రైతులకు మద్దతుగా రాజధాని గ్రామాల్లో సిని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజధాని తరలింపును నిరసిస్తూ ఆందోళన చేపట్టిన రైతులకు సంఘీభావం ప్రకటిస్తారు. ఆయనతో పాటుగా భార్య వసుంధర, పెద్ద కూతురు నారా బ్రాహ్మణి, అల్లుడు లోకేశ్ కూడా రానున్నారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి గ్రామాల్లో నిరాహార దీక్ష శిబిరాలను బాలయ్య సందర్శించి, రైతుల నిరసనలకు, ధర్నాలకు మద్దతు ప్రకటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news