అమరావతి రైతుల పాదయాత్రను శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టనివ్వం – మాజీ మంత్రి ధర్మాన

-

అమరావతి రైతుల పాదయాత్రను శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టనివ్వమని మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ స్పష్టం చేశారు. విశాఖపట్నం రాజధాని కోసం పదవులకు రాజీనామా చేయడానికి అయినా వెనకాడబోమని హెచ్చరించారు. చంద్రబాబు, ఆయన అనుచరులు విశాఖ రాజధాని వద్దంటూ చెబుతున్న మాటలకు గట్టి సమాధానం ఇస్తామని చెప్పారు. తన ఆస్తులు హైదరాబాదులో పెంచుకున్న చంద్రబాబు అమరావతి రాజధాని అంటూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

విశాఖ రాజధానిగా ఏర్పడితే ఉత్తరాంధ్ర ప్రజల భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాడు చెన్నై, కర్నూలు, హైదరాబాద్ పరిగెత్తామని.. మా ప్రాంతానికి రాజధాని వస్తే చంద్రబాబుకు వచ్చిన అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. విశాఖ రాజధాని వద్దని చంద్రబాబు అంటున్నారని.. అడ్డువచ్చిన వారిని చితక్కొట్టాలని అంటున్నారని చంద్రబాబు పై మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news