పోలవరం ప్రాజెక్టు గురించి మట్లాడే హక్కు బాబుకు లేదు-మంత్రి అంబటి రాంబాబు

-

పోలవరం ప్రాజెక్టు గురించి మట్లాడే హక్కు బాబుకు లేదన్నారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. పోలవరంలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. 1995లో ముఖ్య మంత్రి అయ్యి తర్వాతి కాలంలో 14యేళ్లు సీయం గా వున్న చంద్రబాబు ఎప్పుడైనా పోలవరం గురించి మాట్లాడారా.? అని నిలదీశారు.

పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్ర బాబు కి లేదు..ప్రాజెక్ట్ ల గురించే కాదు, నీటి గురించి అసలు మాట్లాడే అర్హత లేదన్నారు. ఆయన పాలనలో వర్షాలు పడవని…పోలవరం లో 72శాతం పనులు పూర్తి చేశామని చంద్రబాబు అనడం పచ్చి అబద్ధమని చెప్పారు. ప్రతి పక్షాలు, వైసీపీ కి వ్యతిరేకంగా వున్నవారు అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని ఆగ్రహించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పోలవరం గురించి మాట్లాడారా? పోలవరంలో 72 శాతం పనులు పూర్తిచేశామనడం అబద్ధం.. పోలవరం ప్రాజెక్టు గురించి మట్లాడే హక్కు బాబుకు లేదన్నారు మంత్రి అంబటి రాంబాబు.

Read more RELATED
Recommended to you

Latest news