అధికారం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారు : మంత్రి అంబటి రాంబాబు

-

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో పర్యటించారు. ఈ విషయంపై మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో చంద్రబాబు పై సెటైర్లు వేశారు. చంద్రబాబు ఈ నియోజకవర్గానికి వచ్చి ఏమీ ఉపయోగం లేదని.. ఇది అట్టర్ ప్లాప్ అయిందని మాట్లాడారు. చంద్రబాబు సభకు ప్రజలు వెళ్లకపోయినా , టీడీపీ అండ్ కో భారీగా జనాలు వచ్చారని చెప్పుకోవడం వారి ఖర్మ అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు తన జీవితం మొత్తం మీద ఒక్క నిజం కూడా చెప్పలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని సొంతం చేసుకోవాలన్న ఒక్క అజెండా మీదనే చంద్రబాబు ఉన్నారు.

అధికారం కోసం ఏమి చేయడానికైనా వెనుకాడడని అన్నారు, ఇందుకు అవసరం అయితే ఎవరినైనా తిడతారు లేదా పొగడతారు అన్నారు. మరి ఈ సారి ఎన్నికలు చాలా ఉత్కంఠగా జరగనున్న నేపథ్యంలో ప్రజలు ఎవరిని ఆశీర్వదించనున్నారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news