జనసేన పార్టీ లోకి అంబటి రాయుడు…!

-

క్రికెటర్ అంబటి రాయుడు వైయస్ఆర్సీపీని విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. ఆటలో ఫోకస్ చేయాలని పార్టీని విడిచిపెట్టారు అంబటి రాయుడు. ఇలా వైసీపీకి రాజీనామా చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ కి వెళ్లారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు అంబటి రాయుడు. ఇరువురి మధ్య చర్యలు జరుగుతున్నాయని జనసేన వర్గాలు చెప్పాయి.

అంబటి రాయుడు ని పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారా లేకపోతే జనసేన లో చేరుతున్నారా అన్నది ఎవరికీ తెలియలేదు. అయితే జనసేన పార్టీలో అంబటి రాయుడు చేరే అవకాశం ఉందని అంతా భావించారు. అది నిజమేనని ప్రూవ్ అయిపోయింది అంబటి రాయుడు జనసేనలో చేరతారట. అంబటి రాయుడు తాజాగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యి పార్టీలో చేరతారట.

Read more RELATED
Recommended to you

Latest news