బెంగళురూ ‘సీఈవో’ కేసులో కీలక విషయాలు.. కొడుక్కి దగ్గుమందు ఓవర్ డోస్ ఇచ్చి చంపిందా?

-

బెంగళూరు సీఈవో తన నాలుగేళ్ల కుమారుడిని గోవాలో హత్య చేసిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న గోవా పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. ఆమె గోవాలో స్టే చేసిన హోటల్ గదిలో రెండు ఖాళీ దగ్గు మందు సీసాలు పోలీసుల కంటపడ్డాయి. అందులో చిన్న సీసాను అక్కడి సిబ్బందే తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడి కాగా.. పెద్ద సీసాను సుచనా తనతో పాటు తీసుకొచ్చి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

హత్యకు ముందు ఆ చిన్నారికి ఆమె దగ్గు మందు ఓవర్‌డోస్‌ ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత బాలుడిని దిండు లేదా దుస్తులతో ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోస్టుమార్టంలో వెల్లడైందని తెలిపారు. ముందస్తు ప్రణాళికతోనే ఈ హత్య జరిగినట్లు కన్పిస్తోందని వెల్లడించారు. పోస్టుమార్టం నివేదికలో చిన్నారి ఊపిరాడక చనిపోయినట్లు తేలిందన్న పోలీసులు.. బాలుడు నిద్రలో ఉండగా దిండు లేదా దుస్తులతో ఊపిరాడకుండా చేసి ఉండొచ్చు అని సీనియర్‌ పోలీసు అధికారి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news