‘కార్పెంటర్’ సర్ ప్రైజ్ చూసి కన్నీళ్లు పెట్టుకున్న ఎంఎం కీరవాణి

-

అమెరికా మ్యుజీషియన్ రిచర్డ్ కార్పెంటర్ ఎంఎం కీరవాణికి స్పెషల్ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈ సర్‌ప్రైజ్‌ చూసి ఎం ఎం కీరవాణి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని దర్శకధీరుడు, కీరవాణి సోదరుడు ఎస్ ఎస్ రాజమౌళి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆస్కార్‌ ప్రమోషన్స్ నుంచి అవార్డు స్వీకరించిన తర్వాత కూడా  ప్రశాంతంగా ఉన్న కీరవాణి రిచర్డ్‌ సందేశం చూసిన వెంటనే ఉద్వేగానికి లోనైనట్లు జక్కన్న చెప్పారు.

‘‘సర్‌.. ఆస్కార్‌ ప్రచారంలో మొత్తం అన్నయ్య ఎలాంటి భావోద్వేగాన్ని ప్రదర్శించలేదు. ఆస్కార్‌ గెలుపొందడానికి ముందు, ఆ తర్వాత కూడా ఆయన ఏ విధమైన ఉద్వేగాన్నీ బయటపెట్టలేదు. కానీ, మీ పోస్ట్‌ చూశాక ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. మా కుటుంబానికి ఇదొక మధురానుభూతి’’ అని రాజమౌళి పేర్కొన్నారు.

ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పాటకుగాను ఆస్కార్‌ గెలుచుకున్న తర్వాత కీరవాణి మాట్లాడుతూ.. తాను రిచర్డ్‌ కార్పెంటర్‌ సాంగ్స్‌ వింటూ పెరిగాను అని చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రిచర్డ్‌ ఫేమస్‌ సాంగ్‌ ‘టాప్‌ ఆఫ్‌ ది వరల్డ్‌…’ను తనదైన శైలిలో మార్చి స్టేజ్‌పై కీరవాణి పాడి వినిపించారు.

దీనిపై ఆనందం వ్యక్తం చేసిన రిచర్డ్‌.. కీరవాణి, చంద్రబోస్‌కు అభినందనలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. తన కుమార్తెలతో కలసి ఆయన ‘టాప్‌ ఆఫ్‌ ది వరల్డ్‌…’ పాటను ఆలపిస్తూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కి కంగ్రాట్స్‌ చెప్పారు. ఆ పోస్ట్‌పై కీరవాణి ఆనందం వ్యక్తం చేశారు. కార్పెంటర్‌ పోస్ట్‌ చూసి తనకు కన్నీళ్లు వచ్చేశాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news