రేపు రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన

-

సార్వత్రిక ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో బీజేపీ ప్రచారంలో జోరు పెంచింది. ఇప్పటికే పలువురు అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణకు వరుస కడుతున్నారు. ఇప్పటికే అగ్రనేతలు పలుమార్లు రాష్ట్రంలో పర్యటించి ప్రచారాన్ని హోరెత్తించారు. ఇక మరోసారి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

గురువారం రోజున (మే 9వ తేదీ) అమిత్ షా తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. భువనగిరిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో ఇవాళ రాత్రే అమిత్ షా హైదరాబాద్కు చేరుకోనున్నారు. రేపు ఉదయం భువనగిరిలో పర్యటించనున్నట్లు పార్టీ రాష్ట్ర వర్గాలు తెలిపాయి. అమిత్ షా పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు భువనగిరి స్థానిక బీజేపీ నేతలు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news