సికింద్రాబాద్ లో సామాన్య కార్యకర్త నివాసానికి వెళ్లిన అమిత్ షా

-

బిజెపి అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి సికింద్రాబాద్ చేరుకున్న అమిత్ షా ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు చేసిన అనంతరం సికింద్రాబాద్ లోని సాంబమూర్తి నగర్ లోని పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త ఎన్. సత్యనారాయణ నివాసానికి వెళ్లారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బండి సంజయ్, తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి.మంగళహారతులిచ్చి అమిత్ షా, బండి సంజయ్, కిషన్ రెడ్డిల కు స్వాగతం పలికారు సత్యనారాయణ కుటుంబ సభ్యులు.

కార్యకర్త సత్యనారాయణను, ఆయన కుటుంబ సభ్యులను అమిత్ షాకు పరిచయం చేశారు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి. బీజేపీ కార్యకర్త ఎన్.సత్యనారాయణ కుటుంబ సభ్యులను అడిగి మరీ తేనీరు సేవించారు అమిత్ షా. అమిత్ షాను చూడగానే ఉబ్బితబ్బిబ్బైన సత్యనారాయణ కుటుంబ సభ్యులు. ఆనంద భాష్పాలు రాల్చారు సత్యనారాయణ. దాదాపు 15 నిమిషాలపాటు సత్యానారాయణ కుటుంబ సభ్యులతో గడిపారు అమిత్ షా, బండి సంజయ్, కిషన్ రెడ్డి.సత్యనారాయణతోపాటు ఆయన కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అమిత్ షా.

Read more RELATED
Recommended to you

Latest news