అమ్మకానికి 17 ఏళ్ళ బాలిక !

-

తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా నవాబు పేట మండలం హజాపుర్ లో ఒక దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసే స్థోమత లేక తమ సొంత కుమార్తెను రాజస్థాన్ వాసికి అమ్మే ప్రయత్నం చేశారు తల్లి దండ్రులు. బాలిక బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

బాలిక విక్రయాన్ని అడ్డుకున్న పోలీసులు ఆమెను స్టేట్ హోమ్ కి తరలించారు. బాలిక తల్లిదండ్రులు హైదరాబాదులో కూలీలుగా పని చేస్తున్నారు అని తెలుస్తోంది. బాలిక వయసు 17 ఏళ్లు కాగా పెళ్లి వయసు వచ్చేసిందని ఇక పెళ్లి చేసేయాలని వారు భావించగా కుర్ర వాళ్ళు అందరూ కట్నాలు అడుగుతున్నారని, అంత ఇచ్చుకునే స్తోమత తమకు లేదని భావించి వారు అమ్మకానికి సిద్దం అయినట్టు చెబుతున్నారు. బాలిక వివరాలు వెల్లడించెందుకు పోలీసులు ఇష్టపడడం లేదు. ఏదేమైనా ఈరోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. 

Read more RELATED
Recommended to you

Latest news