మైనర్‌ బాలిక రేప్‌లో ఫోటోలు, వీడియా బయటకు రావడంపై పోలీసుల ఆరా

-

హైదరాబాద్‌లోని అమ్నేషియ పబ్‌ మైనర్‌ బాలిక కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుతులను కఠినంగా శిక్షించాలంటూ రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద బీజేపీ శ్రేణులతో కలిసి ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆందోళన నిర్వహించారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల ఫొటోలు, వీడియోలను మీడియాకు చూపించారు. అయితే, ఈ ఫొటోలు, వీడియోలు ఆయనకు ఎలా చేరాయన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసు అధికారులు.

Amnesia Pub Rape Case : ఫోటోలు, వీడియోలు లీక్.. అలర్టైన పోలీసు  ఉన్నతాధికారులు, అత్యవసర భేటీ

కేసు దర్యాప్తులో భాగంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నిన్న ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. శాంతిభద్రతలు, ఇంటెలిజెన్స్, వెస్ట్ జోన్ పోలీసులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు ఆ ఫొటోలు ఎలా చేరాయన్న విషయమై చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన సాదుద్దీన్ మాలిక్‌ను పోలీసులు విచారిస్తున్నారు. సమావేశం అనంతరం డీసీపీ జోయల్ డేవిస్ మాట్లాడుతూ బాధితురాలి గుర్తింపును ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ప్రసారం చేయొద్దని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news