అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ షురూ… ఆహారాన్ని వడ్డించిన అపర కుబేరుడు

-

భారత దేశ అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక జామ్నగర్లోని రిలయన్స్ టౌన్షిప్ సమీపంలో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు జోగ్వాడ్ గ్రామ ప్రజలు హాజరవగా.. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ స్వయంగా వారికి ఆహారాన్ని వడ్డించారు. రాధిక అమ్మమ్మ, తల్లిదండ్రులు వీరేన్, శైలా మర్చంట్ కూడా అన్నదాన సేవలో పాల్గొన్నారు.అన్నసేవలో భాగంగా సుమారు 51 వేల మంది స్థానిక నివాసితులకు రుచికరమైన వంటకాలను సిద్ధం చేశారు. మరికొన్ని రోజుల వరకూ ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొననుంది.

భోజనానంతరం ఈ వేడుకకు హాజరైన వారు సంప్రదాయ జానపద సంగీతంతో మైమరిచిపోయారు. ప్రఖ్యాత గుజరాతీ గాయకుడు కీర్తిదాన్ గాధ్వీ ఈ కార్యక్రమానికి హాజరు అయినారు.

Read more RELATED
Recommended to you

Latest news