ఏపీలో 26 జిల్లాలకు కేబినెట్ ఆమోదం… ఏ క్షణమైనా ఫైనల్ నోటిఫికేషన్

-

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు తుది అంకానికి చేరింది. తాజాగా 26 జిల్లాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏ క్షణమైనా ఫైనల్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధం అయింది. ఇప్పుడున్న 13 జిల్లాలను పునర్వ్యస్థీకరించి 26 జిల్లాలుగా చేయనున్నారు. అయితే రెండు రెవెన్యూ డివిజన్ల హెడ్ క్వార్టర్లను మార్చనుంది ప్రభుత్వం. అయితే దీనికి కేబినెట్ ఆమోదం తీసుకోనుంది. 26 జిల్లాలో 73 డివిజన్లతో ఫైనల్ గెజిట్ రానుంది. ప్రతీ జిల్లాలో కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఒక్కో రెవెన్యూ డివిజన్ లో కనీసం 8 మండలాలు ఉండేలా జిల్లాల ఏర్పాటు కానుంది. ఒక్కో జిల్లాలో కనిష్టం 6 అసెంబ్లీ నియోజకవర్గాలు… గరిష్టంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటేలా ప్లాన్ చేశారు. రెండు జిల్లాల పేర్లను మార్చారు. గతంలో మన్యం జిల్లా పేరును పార్వతీపురం మన్యం జిల్లాగా మర్చారు. శ్రీ బాలాజీ తిరుపతి జిల్లాను తిరుపతి జిల్లాగా పేర్లు మార్చారు. ఏపీలో గతంలో 51 రెవెన్యూ డివిజన్లు ఉంటే ప్రస్తుతం 73 రెవెన్యూ డివిజన్లు గా మారనున్నాయి. పాత రెవెన్యూ  డివిజన్లు యదాతథంగా ఉండనున్నాయి. మరోవైపు ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ బదిలీల కసరత్తు జరుగుతోంది. కొత్తగా ఏర్పడనున్న 13 జిల్లాలకు వీటిని బదిలీ చేయనున్నారు. కొత్త జిల్లాలకు సీనియర్ అధికారులను నియమించి.. పాత జిల్లాలకు జూనియర్ అధికారులను కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news